Headlines

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో యాడికి మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్…

న్యూస్.9)జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు యాడికి మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన చందన మరియు రాయల్ చెరువు, లక్ష్సంపల్లి కేశవాయుని పేటలో పోలీసులు ఈరోజు ఫ్లాగ్ మార్చ్, గ్రామసభలు నిర్వహించారు. యాడికి యు.పి.ఎస్ సి.ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో BSF మరియు పోలీసు సిబ్బందితో ఆయా గ్రామాలలోని ప్రధాన రహదారులలో మరియు ముఖ్యమైన కాలనీల గుండా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతవరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు. ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసే లిక్కర్, డబ్బు, తదితరాలు ఏవి అక్రమ రవాణా జరగకుండా సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.