Headlines

యాడికి మొహరం ప్రశాంతంగా జరుపుకోండి… గొడవలకు దిగితే చర్యలు– తాడిపత్రి డీఎస్పీ జనార్ధన్ నాయుడు, సీఐ నాగార్జున రెడ్డి యాడికి యుపిఎస్..

న్యూస్.9)

మొహరం పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని… గొడవలకు దిగితే చర్యలు తప్పవని తాడిపత్రి డీఎస్పీ జనార్ధన్ నాయుడు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో సి.ఐ నాగార్జున రెడ్డి తో కలిసి ఆయన ఈరోజు యాడికిలో గ్రామ పెద్దలు, మొహరం వేడుకల నిర్వాహకులతో సమావేశమయ్యారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఉత్తేజభరితంగా జరుపుకునే ఈ వేడుకలలో అల్లర్లకు తావుండరాదన్నారు. అందరూ సోదరభావంతో మెలగాలని సూచించారు. చిన్న సరిగెత్తి, పెద్ద సరిగెత్తి మరియు జలధి కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిసేలా అందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు. చట్ట విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.