Headlines

లాలాల వీధిలో నీటి సమస్య ను తీర్చిన చవ్వ గోపాల్ రెడ్డి….టిడిపి మండల కన్వీనర్ రుద్రమ నాయుడు..

న్యూస్. 9) యాడికి.

మాట ఇచ్చారంటే చాలు ఎలాంటి పని అయినా పూర్తి చేస్తారు అనే నమ్మకాన్ని మరొకసారి నిరూపించారు మన టిడిపి నాయకులు రుద్రమ నాయుడు చవ్వా గోపాల్ రెడ్డి …నిన్నటి రోజున పీర్ల చావిడి ప్రారంభోత్సవానికి లాలాల వీధికి విచ్చేసిన సందర్భంగా అక్కడ మహిళలు ఎదుర్కుంటున్న నీటి సమస్యను తెలుసుకొని వెంటనే అధికారులతో మాట్లాడి పైప్ లైన్ ను మరమ్మతు చేయించి 10 గంటల గడవక ముందే ఆ కాలనీ కి నీటిని వదిలేటట్లు చేసి కాలనీ వాసుల మన్ననలు పొందారు…ఈ కార్యక్రమంలో చవ్వ గోపాల్ రెడ్డి. మండల కన్వీనర్ రుద్రమ నాయుడు. గండికోట లక్ష్మణ్,కోడూరు చంద్ర శేఖర్ రెడ్డి, నీలకంఠ రెడ్డి, మయకుంట్ల నారాయణ స్వామి, భాషా, పాల్గొన్నారు.