Headlines

దుద్దెడలో పుల్వామా అమరులకు నివాళులు అర్పించిన క్రీడాకారులు

దుద్దెడలో
పుల్వామా అమరులకు నివాళులు అర్పించిన క్రీడాకారులు

దుద్దెడ ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉమ్మడి కొండపాక మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు ఈరోజు ముఖ్యఅతిథిగా హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు కలకుంట్ల మల్లికార్జున్ గారు హాజరై
ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ గారితో కలిసి ఈరోజు ఖమ్మం పల్లి కుకునూరు పల్లి గ్రామాల మధ్యల జరిగే క్రికెట్ టోర్నమెంట్ కు టాస్ వేసి ప్రారంభించడం జరిగింది..

అనంతరం పుల్వామాలో అమరులైన భారత జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి పాటించడం జరిగింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ {HCA} సభ్యులు మల్లికార్జున్ గారు మాట్లాడుతూ. ఉగ్రమూకల చేతిలో అసువులు బారిన భరతమాత బిడ్డలారా మీకు పాదాభివందనం..
మీ వీరమరణం భారతావని గుండెల్లో శోకాన్ని నింపింది.. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం మీ త్యాగం ఎన్నటికీ మర్చిపోదు ఈ భారతావని..
మీ త్యాగం వృధా పోదు-మీ ఆశయం ఆగిపోదు అని అన్నారు.

అలాగే ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి కొండపాక మండల స్థాయి ఇంత గొప్ప టోర్నమెంట్ నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు.
ఈ టోర్నమెంట్లో ఫైనల్ కు చేరిన ఇరు జట్లను సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపిస్తామని,
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా మరియు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో ఆడించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు మిద్దె శివకుమార్, పంజాల శ్రీనివాస్, ఎండి జబ్బర్,, నర్సింలు,
దుద్దెడ, ఖమ్మం పల్లి, కుకునూరుపల్లి క్రీడాకారులు తోపాటు తదితరులు పాల్గొన్నారు……