Headlines

ఒకే రోజు రెండు అంతక్రియలు చేసిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్..

పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన వెన్నపూస శివారెడ్డి శనివారం రాత్రి మరణించడంతో ఆదివారం ఉదయం ఆ ఊరి సర్పంచ్ రామాంజుల రెడ్డి యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో యాడికి నుంచి ఫౌండేషన్ సభ్యులు వెళ్లి వెన్నపూస శివారెడ్డి అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమం పూర్తి చేసి వచ్చిన వెంటనే రెండు గంటలకు యాడికి మండల కేంద్రంలోని బుగ్గ రోడ్డు అనుకొని ఉన్న ఓంశాంతి వీధిలో వేల్పుల రామచంద్ర భార్య ఆదిలక్ష్మి అనారోగ్యంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. రామచంద్ర కి కొడుకులు లేకపోవడం మరియు మోయడానికి మనుషులు లేకపోవడంతో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ని సంప్రదించడం జరిగింది. ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి వెళ్లి ఆదిలక్ష్మి అంత్యక్రియలు వారి సంప్రదాయ బద్ధంగా పూర్తి చేయడం జరిగింది. ఈ అంతిమయాత్ర కార్యక్రమాలలో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ, ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, సిద్ధవటం తిరుమలరెడ్డి, చింతా నరసింహ, బడిగించల వేణు, సాయి వరపు నాగరాజు, మెటికల చెన్నయ్య, కాంతమ్మ, గాంధీజీ స్కూల్ రామ మోహన్, జొన్నల వెంకటేష్, పాల్గొనడం జరిగింది..