Headlines

20 మంది ఐపీఎస్ ల బదిలీ.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు.. –

రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. డీజీపీగా రవి గుప్తాకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. రోడ్డు భద్రతా విభాగం చైర్మన్ గా అంజనీకుమార్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా రాజీవ్ రతన్, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా,

 

సీఐడీ అదనపు డీజీపీగా శిఖా గోయెల్, రైల్వేస్ & రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా మహేష్ భగవత్, హోంగార్డ్స్ ఐజీపీగా స్టీఫెన్ రవీంద్ర, ఎఫ్ఏసీ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డిలు నియమితులయ్యారు.