Headlines

పెనుకొండ పట్టణంలో నీటి సమస్య పరిష్కరించాలని నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ గారికి సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు,..

 

 

పెనుకొండ పట్టణం మరియు నగర పంచాయతీ పరిధిలో ఉన్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గత 10 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడం వలన ప్రజలు నీళ్ల కోసం వాటర్ ట్యాంకులు సొంతంగా డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది వేసవికాలం రాకముందే ఈ రకమైన త్రాగునీటి సమస్య తీవ్ర ఎద్దడిగా ఉంది అని కమిషనర్ గారితో సిపిఎం నాయకులు వాపోయారు ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులు పడుతున్న సమస్యను పరిష్కరించాలని కమిషనర్ వినతిపత్రం అందజేశారు వారు స్పందిస్తూ రెండు రోజుల్లోగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరి, తిప్పన్నా, బాబావలి, గంగాధర్, రాజు రావు, ఆల్ కౌసర్ సంస్థ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.