Headlines

నేరేడ్మెట్ డివిజన్ ఎమ్మార్వో కార్యాలయానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పలు సమస్యలపై ఎమ్మార్వో సీతారాం గారికి కలిసి వినతి పత్రం అందజేశారు..!

నేరేడ్మెట్ డివిజన్ ఎమ్మార్వో కార్యాలయానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పలు సమస్యలపై ఎమ్మార్వో సీతారాం గారికి కలిసి వినతి పత్రం అందజేశారు, ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నిర్దిష్ట సమయంలో అందజేయాలని. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్(UPHC) అగ్నిమాపక కేంద్రం (ఫైర్ స్టేషన్). ముస్లిమ్స్ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని. మల్కాజ్గిరి సర్దార్ పటేల్ నగర్ లోని 74 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని. చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన కొంతమంది ఇండ్ల పట్టాలు గతంలో ఇవ్వని వారికి ఇండ్ల పట్టాలు అందజేయాలని.మహేంద్ర హిల్స్ లోని సర్వే నంబర్ 84/A గల ప్రభుత్వ భూమిని సర్వే చేయించాలని విన్నతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, రావుల అంజయ్య, జీకే హనుమంతరావు, చిందం శ్రీనివాస్, సర్వీస్ యాదవ్, సతీష్, బాలకృష్ణ గుప్తా, ఉపేందర్, గణేష్, శివకుమార్, శ్యామ్, నవీన్, సుధీర్, శోభ, ప్రమీల, జయమ్మ, పరిమళ, పలువురు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.