Headlines

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి

చిత్తూరు జిల్లా

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నుండి శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం స్వామి వారికి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14 వ తేదీ మంగళవారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు దేవస్థానం కార్యనిర్వాహనధికారి వెంకటేశు కుటుంబ సమేతంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈ.వో లవన్న, కాణిపాకం దేవస్థానం బోర్డు సభ్యులు అనిత, రామసుబ్బమ్మ, సూపర్డెంట్ కోదండపాణి, బాలాజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.