Headlines

వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మహా శివరాత్రి వేడుకలు

వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మహా శివరాత్రి వేడుకలు

కాణిపాకం దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మరియు చైర్మన్ మోహన్ రెడ్డి

చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, నాగవాండ్లపల్లి గ్రామ పంచాయతీ, ఐరాల – మఠంపల్లి మిట్ట శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వాముల వారి ఆలయం, శనివారం మహాశివరాత్రి సందర్భంగా స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ . బాబు మరియు ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా వంశ పారంపర్య ధర్మకర్త ఏ. ధన చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు పూజారి మోహన్ రెడ్డి మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి స్వామి వారి ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పూజారి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి, భక్తులకు స్వామివారు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బుజ్జి రెడ్డి, కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఎంపీటీసీ 35 యర్లంపల్లి లతరాజేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ నిత్య సురేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ నాగరాజ, పూతలపట్టు నియోజకవర్గం బిసి సంఘం అధ్యక్షులు మబ్బునేని శేఖర్, రవి రెడ్డి, ఐరాల మండల సచివాలయాల కన్వీనర్ ప్రతాపరెడ్డి,
పంచాయితీ ల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు.