Headlines

రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులకు తీవ్ర గాయాలు

 

కొత్తపేట… కొత్తపేట మండలం కండ్రిగ మెయిన్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం అమలాపురం వైపు నుండి కొత్తపేట వైపు వస్తున్న కియా కార్ ను కొత్తపేట నుండి ఆవిడి గ్రామం వైపు ద్విచక్ర వాహనం పై వస్తున్న ఇరువురు యువకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిరువురు ఆవిడి గ్రామానికి చెందినవారుగా తెలియ వచ్చింది. ఈ ప్రమాదంలో ఇరువురికి చేతులు, కాళ్లు విరిగిపోగా ఒక యువకుని తలకు తీవ్ర గాయమైనట్లు స్థానికులు తెలిపారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మోటార్ సైకిల్, కారు తీవ్రంగా దెబ్బతిన్నాయి.