Headlines

ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ అరెస్టులు..

ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ అరెస్టులు..

ఆదిరెడ్డి వారి కుటుంబానికి ప్రజలలో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నమే ఈ అక్రమ అరెస్టులు.

రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు సతీమణి మేయర్ గా ఆయన ఎమ్మెల్సీగా వారి కోడలు ఎమ్మెల్యేగా వరుసగా పదవులు పొందారు. వారి కుమారుడు ఆది రెడ్డి వాసు రాజకీయాల్లో చురకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తూ అండగా నిలబడి ఆది రెడ్డి కుటుంబం రాజమండ్రిలో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

2019 లో జరిగిన ఎన్నికలలో రాజమండ్రి రెండు నియోజకవర్గాలలో విజయం సాధించి తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది.
పట్టు నిలుపుకొని రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించే దిశలో ఉన్నాయి.
కనుకనే రాజకీయంగా ఎదుర్కొనలేక వ్యక్తిగతంగా దెబ్బకొట్టే కుటిల ప్రయత్నాలు మొదలుపెట్టారు.
లేనిపోని ఆరోపణలతో నిందల మోపి అక్రమ అరెస్టులకు తెరలేపారు.

ఇక్కడే కాదు రాష్ట్రంలో పలుచోట్ల అధికారం అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు.
బంగారానికి మట్టి పూసినంత మాత్రాన దాని విలువ తగ్గిపోదన్న విషయం వైసిపి నాయకులు తెలుసుకోవాలి.
ప్రజాక్షేత్రంలో గెలవాలంటే ప్రజల మన్నలను పొందాలి.
అంతేగాని ఎదుటివారిపై లేనిపోనివి ఆపాదించి బురద చల్లడానికి ప్రయత్నిస్తే కడిగిన ముత్యంల బయటపడి మరింత బలపడతారన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు..

ఆదిరెడ్డి కుటుంబం ఎన్నో ఏళ్లుగా జగదీశ్వరి పేరుతో చిట్ ఫండ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. వారి మీద ఎటువంటి ఆరోపణలు ఫిర్యాదులు లేనప్పటికీ అక్రమ అరెస్టులు చేశారు.. వారి ప్రతిష్ట దెబ్బతీయడానికే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని భావించవలసి వస్తుంది.

ప్రజాస్వామ్యదేశంలో ప్రజలే న్యాయ నిర్మాతలు. ఇటువంటి నీచ ,దిగజారుడు రాజకీయాలకి ప్రజలు తగిన రీతీలో బుద్ధి చెబుతారు..

అది రెడ్డి అప్పారావు, అది రెడ్డి వాసుల అక్రమ అరెస్టులను కొత్తపేట తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.• • •..

🙏🙏🙏🙏
〰️〰️〰️〰️
మీ • • గుబ్బల మూర్తి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొత్తపేట