Headlines

తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాబు షూరిటీ, భవిష్యత్కు గ్యారెంటీపై కార్యకర్తలకు, నాయకులకు, క్లస్టర్ ఇన్చార్జిలకు శిక్షణ

తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాబు షూరిటీ, భవిష్యత్కు గ్యారెంటీపై కార్యకర్తలకు, నాయకులకు, క్లస్టర్ ఇన్చార్జిలకు శిక్షణ ఇచ్చారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని తాయి గ్రాండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది కుంట వెంకటప్రసాద్ పాల్గొని మాట్లాడారు. బాబు ష్యూరిటీ భవిష్య త్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఏయే పథకాలు అవసరమవుతాయో సమాచారం సేకరించా లన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. శిక్షణలో మహిళ కమిషన్ మాజీ సభ్యురాలు పర్వీన్బాను, నాయకులు బండారు మనోహర్నా యుడు, టౌన్ ప్రెసిడెంట్ డైమండ్ ఇర్షాన్, కార్యకర్తలు పాల్గొన్నారు.