Headlines

వైసీపీ నాయకులవి గొప్పలు తప్ప.. చేసిందేమి లేదు…

 

 

అనంతపురం, న్యూస్ 9, నవంబర్ 26:

 

👉అనంతపురం రూరల్ పరిధిలో ఏ కాలనీలో చూసినా సమస్యలే.

Qఅధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారం.

Qప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందజేస్తాం.

👉భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో పరిటాల సునీత.

 

ఈ నాలుగున్నరేళ్లు గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలు చేశారు. అనంతపురం రూరల్ పరిధిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాపంపేట పంచాయతీ విద్యారణ్యనగర్ లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్తూ టీడీపీ, జనసేన మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలను వివరిస్తూ.. ఏ ఇంట ఎన్ని పథకాలు అందవచ్చు.. దాని వలన ఎంత లబ్ధి చేకూరుతుందనేది వివరించారు. తాము అధికారంలోకి రాక ముందే మీకు ఎలాంటి పథకాలు ఇస్తాము.. వాటి వలన మీకు కలిగే లబ్ధిని చెబుతున్నామని ఈ సందర్భంగా పరిటాల సునీత వ్యాఖ్యానించారు. మరోవైపు స్థానికులు రోడ్లు, డ్రైనేజీ ఇతర సమస్యలకు సునీత దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురం నగరానికి సమీపంలోని కాలనీలు కావడంతో రోజు రోజుకీ ఇళ్లు జనాభా విస్తరిస్తోందని.. కానీ అందుకు తగిన విధంగా సౌకర్యాలు మెరుగుపడటం లేదన్నారు. ఎన్నికల్లో ఓట్లు కోసం వచ్చిన ప్రకాష్ రెడ్డి ఏఏ హామీలు ఇచ్చారు.. ఇప్పుడు ఏం నెరవేర్చారో చెప్పాలన్నారు. ప్రజల మధ్య తిరిగితే సమస్యలు తెలుస్తాయని.. వాటిని పరిష్కరించే వీలుంటుందని సునీత అన్నారు. అలా కాకుండా మాపై విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. సంపాదన మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద లేదన్నారు. ఇవాళ కనగానపల్లిలో ప్రారంభించిన నూతన లైబ్రరీ భవనానికి తెలుగుదేశం పార్టీ హయాంలో 25లక్షలు వెచ్చించినట్టు వివరించారు. ఈ వైసీపీ పాలనకు మిగిలింది నాలుగు నెలలేనని.. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.