Headlines

అయోధ్య రామ మందిరం అక్షింతలు మోతే గ్రామంలో ఇంటింటికి చారవేస్తున్న కార్యక్రమం

బూర్గంపాడు జనవరి 3 న్యూస్ 9

బూర్గంపాడు మోతే గ్రామంలో అయోధ్య రాముని అక్షింతలు ఇంటింటికి చేరవేస్తున్న కార్యక్రమం లో మోతే గ్రామ మహిళా మణులు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అక్షింతలు మహిళలందరూ కలిసికట్టుగా ఇంటింటికి అందిస్తూ ఈ అక్షింతలు యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరుగుతుంది. అయోధ్య రామ మందిర్ నిర్మాణంలో భాగంగా పూజలు జరిపించి ఆ పూజా కార్యక్రమంలో అక్షింతలు ప్రసాదంగా భావించి ఇంటింటికి చేరవేయాలని ఉద్దేశంతో గ్రామాలకు పట్టణాలకు పంపించడం జరిగినది .ఈ యొక్క కార్యక్రమంలో మోతే వచ్చినటువంటి ఈ యొక్క అక్షింతలను ఇంటిలో పూజ గదిలో భద్రపరుచుకొని 22వ తారీకు వరకు పూజ గదిలో ఉంచుకొని 22వ తేదీ అయోధ్య రామ మందిరంలో పూజలు జరిపిన అనంతరం మన ఇండ్లలో పూజలు జరుపుకొని ఇంటిపెద్దల చేత అక్షింతలు వేసుకోవాలని చెప్పుకుంటూ గ్రామం అంతా జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ ఈ కార్యక్రమంలోపాలుపంచుకోవడం అదృష్టంగా భావించడమే కాకుండా చాలా ఆనందంగా ఉంది అంటూ మోతే మహిళా మణులు చెప్పడం జరిగింది.