పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమల్లోకి
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు పలు రాష్ట్రాలు అపుడే ఉపక్రమిస్తున్నాయి. కేంద్ర సూచనలతో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమల్లోకి తెస్తున్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్7 సబ్ వేరియంట్తో ముప్పు ఉందన్న నిపుణులతో హెచ్చరికలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు మళ్లీ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా, విద్యా సంస్థల్లో మాస్కును తప్పనిసరి చేసింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లలో మాస్కులు…