Headlines

అగ్నిప్రమాద బాధితులకు చిర్ల పరామర్శ, ఆర్ధిక సహాయం

//డా.బి.ఆర్.అంబేద్కర్ కొనసీమ జిల్లా//

రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామం మట్టలదొడ్డిలో జరిగిన అగ్నిప్రమాదంలో విత్తనాల వీరభద్రానికి చెందిన ఇల్లు అగ్నికి ఆహుతై ఆస్తి నష్టం సంభవించింది.
మంగళవారం ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి బాధితులను పరామర్శించి 15,000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసి, బియ్యం, దుస్తులు అందచేశారు.
బాధితులతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.
అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుండి రావలసిన నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు