Headlines

సరస్వతి పైపుల షాప్ వద్ద ఉన్న డ్రిప్ పైపుల ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 1.5 టన్స్ డ్రిప్ పైపుల దొంగలించుకుపోయారని ఇచ్చిన పిర్యాదు

తేదీ 0 7.10.2023 వ తేదీన సాయంత్రం 7.30 గంటలకు రిపోర్ట్ అయిన యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామంలోని గుర్రం భాస్కర్ అనే వ్యక్తి యొక్క సరస్వతి పైపుల షాప్ వద్ద ఉన్న డ్రిప్ పైపుల ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 1.5 టన్స్ డ్రిప్ పైపుల దొంగలించుకుపోయారని ఇచ్చిన పిర్యాదు మేరకు, యాడికి పిఎస్ cr.no 179/2023 u/s 379 IPC కేసులో రాబడిన ముద్దాయిల సమాచారం మేరకు ఈ దినం అనగా 08.10.2023 వ తేదీన సాయంత్రం 4:00 గంటల సమయంలో సిబ్బంది సహాయంతో రాయల చెరువు క్రాస్ వద్దకు వెళ్లగా అక్కడ ఒక వ్యక్తి డ్రిప్ వైర్లను పెట్టుకుని పోలీసులను గమనించి పారిపోవుటకు ప్రయత్నం చేయగా, అతనిని పట్టుకొని విచారించగా అతను తనంతట తానుగా తన పేరు హరికృష్ణ తండ్రి లక్ష్మీనారాయణ రాయల చెరువు గ్రామం, యాడికి మండలం అని తను వ్యసనాలకు అలవాటు పడి రాయలచెరువు గ్రామంలోని గుర్రపు భాస్కర్ కు చెందిన ఇంటి ముందు ఉన్న సుమారు1.5 టన్నుల డ్రిప్ వైర్ ను ఎవరికీ తెలియకుండా దొంగతనం చేసి ఆ డ్రిప్ వైర్ ను గుత్తి కి తీసుకొని వెళ్లి అమ్మడానికి వెళ్తుండగా, ముద్దాయిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 1.5 టన్నుల డ్రిప్ వైర్ ను స్వాధీనం చేసుకొని ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది.
ఎస్సై యాడికి పియస్.