Headlines

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం.

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం.
— మూడు లక్షలు ఆస్తి నష్టం.
— కట్టు బట్టలతో నిలిచిన కుటుంబ సభ్యులు.
కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం మడికి గ్రామంలో గల జిల్లా పరిషత్ రోడ్డు ప్రక్కన గల జాస్తి బాబురావు, ఇందిర దంపతులకు చెందిన ఇల్లు ప్రమాదాస్తు నిప్పు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మండపేట అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలు పక్క గృహాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. సమాచారం అందుకున్న మండల డిప్యూటీ తాసిల్దార్ ఆర్ జానకి రాఘవ వీఆర్వో టి సూర్యప్రకాశరావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మూడు లక్షలు రూపాయలు ఆస్తి నష్టం కలిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. కాగా మంటల్లో చిక్కుకున్న జాస్తి ఇందిరకు తీవ్ర గాయాలవడంతో ఆమెను స్థానికులు హుటాహుటిన రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఇంటిలోనికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఇంట్లో గల అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు వంట సామాగ్రి, దుస్తులు పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు.