Headlines

పవన్ కళ్యాణ్ విషయంలో పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు గతంలో పోసాని కృష్ణ మురళి చేయడం జరిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తనకి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు మీడియా సమావేశంలో పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉంటే తాజాగా పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు.

జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో… రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో ఇదే వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో… జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో పోసానిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో.. ఐపీసీ 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ లపై రాజమండ్రి వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదు అయింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోసాని కృష్ణ మురళిని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుండి పోసాని కృష్ణ మురళి వైసీపీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పోసానిపై కేసు నమోదు కావటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.